ధరణి పేరుతో దోపిడీకి ప్రయత్నించిన యువకులు.

భూ సమగ్ర సర్వే కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి వెబ్సైట్ కు ఫేక్ అప్లికేషన్ పుట్టుకొస్తున్నాయి. ధరణి పేరుతో మొబైల్ యాప్ ని క్రియేట్ చేసి వెబ్ సైట్ లో పెట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ధరణి పేరుతో నకిలీ మొబైల్ యాప్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఐదు రోజుల క్రితం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు,తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ డైరెక్టర్. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఐపి అడ్రస్ ఆధారంగా కర్ణాటకలోని బసవ కళ్యాణ్ గ్రామానికి చెందిన మహేష్, ప్రేమ్ మూలి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.