ఇదంతా కరోనా వలనే. ఉన్న షాపులను ముసేస్తున్నం..
ఆ బుక్ స్టోర్ లో పుస్తకాలతో పాటు అన్ని రకాల వస్తువులు ఒకే దగ్గర దొరుకుతాయి . ప్రపంచంలో ఏ పుస్తకం విడుదలైనా వాల్డెన్ బుక్ స్టోర్ లో దొరుకుతుంది.ఎంతో పేరున్న గోల్డెన్ బుక్ స్టోర్ ఇప్పుడు మూత పడింది. హైదరాబాద్ సోమాజిగూడ లో ఉన్న మొదటి స్టోర్ ని క్లోజ్ చేయగా ఇప్పుడు బంజర హిల్స్,గచ్చిబౌలి అవుట్లెట్ కూడా మూసేసారు నిర్వాహకులు. హైదరాబాదులో మొదటి స్టోర్ ను 1990లో ప్రారంభించారు వాల్డన్ నిర్వాహకులు శోభా, రాంప్రసాద్. ఆ తర్వాత మరో రెండు చోట్ల స్టోర్ ఓపెన్ చేశారు.కొన్నేళ్ల క్రితం వరకు కస్టమర్లతో కళకళలాడిన బుక్స్టోర్ క్రమంగా తన ప్రత్యేకతను కోల్పోతూ వచ్చింది. బుక్స్టోర్ మూతపడ్డాయని తెలుసుకున్న కొందరు కస్టమర్లు స్టోర్లో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ తో ఆరు నెలలు ఏలాంటి వ్యాపారం సాగకపోవడం, ప్రజల్లో పుస్తకాలు కొని చదవాలన్న ఆసక్తి తగ్గటం, ఆన్లైన్ బుక్స్ రావడంతో వ్యాపారం దెబ్బతిందని,దీంతో స్టోర్ మూసేశారు,అని తెలుస్తోంది.బుక్ స్టోర్ కు సాధారణ జనం తో పాటు వీఐపీలు కూడా ఎక్కువగా వచ్చే వారు. బుక్ తో పాటు గిఫ్ట్లు అండ్ స్టేషనరీ, గ్రీటింగ్ కార్డ్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఇక్కడ ప్రత్యేకంగా కనిపించేవి. అన్ని రకాల ఐటమ్స్ అందుబాటులో ఉండటంతో పాటు తక్కువ ధరకే దొరకటంతో స్టోర్ కి మంచి పేరు ఉంది.స్టోర్ మూసేసిన విషయాన్ని ట్విట్టర్లో తెలిపారు. వాల్దెన్ నిర్వహులు రాంప్రసాద్.
Comments