దంపతుల మధ్య గొడవ, గ్రామ పెద్దలు తమ ఊరు నుండి వెలి వేశారు...

దంపతుల మధ్య జరుగుతున్న గొడవలు కారణంగా పలుమార్లు పంచాయితీ  నిర్వహించిన కుల పెద్దలు భారీ జరిమానా విధించారు. లక్ష రూపాయలు డిపాజిట్ చేయలేదన్న నేపథ్యంతో ఆ గిరిజన కుటుంబాన్ని కులం నుండి బహిష్కరించారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కురవి మండలం పంచ రాయి తండాకు చెందిన శ్రీకాంత్ కు ముగ్గురు కుమార్తెలు, కూతురు ముగ్గురికి పెళ్లిళ్లు అయిపోయాయి. కానీ శ్రీకాంత్ కు అతని భార్య మధ్య జరుగుతున్న గొడవల ఈ నేపథ్యంలో పలుమారు పంచాయతీ నిర్వహించారు కుల పెద్దలు. ఈ క్రమంలోనే 2018 లో పంచాయతీలకు సంబంధించి లక్ష రూపాయలు డిపాజిట్ చేయలేదని నెపంతో శ్రీకాంత్ కుటుంబాన్ని కులం నుండి పరిష్కరించాలని వాపోయారు. ఆ సమయంలో శ్రీకాంత్ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన లాభం లేకుండా పోయిందని గిరిజన కుటుంబం కన్నీటిపర్యంతమయ్యారు. బాధ్యతగా ఉండే సమస్యలను పరిష్కరించాల్సిన కుల పెద్దలు కులం నుండి వెలి వేయడం భార్య బంధువులతో చేయి కలిపి దాడులకు పాల్పడడం తో శ్రీకాంత్ ఫ్యామిలీ ప్రాణ భయంతో బిక్కుబిక్కు అని కొనసాగిస్తున్నారు.ఈ పరిష్కరణ తో గ్రామంలో ఎవరు తమతో మాట్లాడడం లేదని వ్యవసాయ పనులకు కూడా ఎవరూ రావడం లేదని, పొరుగు గ్రామాల నుండి కూలీలను ట్రాక్టర్లు తీసుకువచ్చిన వారిని బెదిరించి పంపిస్తున్నారని చెప్పారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?