స్వామివారిని దర్శించి తలనీలాలు ఇచ్చుకున్న క్రికెటర్ నటరాజన్...
తమిళనాడుకు చెందిన క్రికెటర్ నటరాజన్ దిండిగల్ జిల్లా పలనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. తలనీలాలు సమర్పించారు. విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని నటరాజన్ తో సెల్ఫీ దిగారు. గత ఏడాది యూఏఈ లో జరిగిన ఐపీఎల్లో హైదరాబాద్ జట్టుకు సారధ్యం వహించిన నటరాజు సత్తా చాటాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం లభించింది. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో t20 1 డే టెస్టుల్లో ఆడి ప్రతిభ చాటాడు. ఆసీస్ పర్యటన ముగించుకొని ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న నటరాజ్ కు ఘన స్వాగతం లభించింది.
Comments