గుడి గోపురం కూడా విడిచి పెట్టనీ కేటుగాళ్లు... పురాతన నాణేలు కోసమే...
చిక్కొల జిల్లాలో పురాతన దేవాలయాల గాలి గోపురం లో ఆనాటి నాణ్యాలు నిక్షేపం చేయబడి ఉంటాయి అని ఆ నాణేలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది అని తెలుసుకున్నా ఓ ముఠా అటువంటి దేవాలయాల్లో టార్గెట్ చేసింది. గాలి గోపురం శిఖరాలను పగలకొట్టి అందులో నాణ్యాలు దోచుకున్న ఉంటాను. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి పురాతన నాణ్యాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం కొమ్మల పల్లి లోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో జనవరి 23న గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోని గాలి గోపురానికి రంధ్రం చేసి దొంగతనం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే సూరి మిస్టరీని ఛేదించారు.దర్యాప్తులో ఇద్దరు ఒడిశాకు చెందిన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50 పురాతన నాణేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నాణేలు ఎంతో శక్తివంతమైన నాణ్యలు అని ప్రజల్లో నమ్మించి ఎక్కువ ధరకు కొందర్ని మోసం చేస్తున్నారని పోలీసులు తేల్చారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. మాయమాటలు చెప్పే వ్యక్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
Comments