పత్తి పండించి సంపాదించిన డబ్బుని సైబర్ కేటుగాడు దోచేశారు...
సైబర్ నేరగాళ్ల ఓ రైతులను నట్టేట ముంచారు. ఒక క్లిక్ తో 2,76,322/-రూపాయలు మాయం చేశారు. ఎంతో శ్రమించి రైతు పండించిన పంట డబ్బులను రైతు అకౌంట్ నుండి ఆన్లైన్ ద్వారా కొట్టేసిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా చెన్నిపాడు గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ తనకున్న కొద్దిపాటి పొలం తో పాటు ఖాళీగా ఉన్న 20 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని ప్రత్తి పంట వేశాడు. ఇద్దరు కొడుకులు సహాయంతో ఏడాది కష్టపడి పత్తి పండించాడు. పండించిన పత్తిని సిసిఐ అడ్డాకుల కేంద్రంలో అమ్మగా వచ్చిన డబ్బుతో 3,41,179/- రూపాయలు రైతు ఎస్బిఐ అకౌంట్ లో ఈనెల 20వ తారీఖున జమ అయింది. ఆ డబ్బు నుండి 50 వేల రూపాయలు అదే రోజు బ్యాంకు ద్వారా డ్రా చేసుకుని మిగిలిన డబ్బును తన చిన్న కొడుకు అయిన సోమశేఖర్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే అదే రోజు సోమశేఖర్ తన ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నం చేయగా ఏటీఎంలో డబ్బులు లేనందున ఎనిమిది వేలు మాత్రమే డ్రా చేసుకున్నాడు. మరుసటి రోజు 26వ తారీఖున సోమశేఖర్ సెల్ కు ఐదు నిమిషాల వ్యవధిలో 19 సార్లు డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ రావడం తో ఆ రైతు భయపడిపోయాడు. ఆ రోజు బ్యాంకు సెలవు కావడంతో ఎస్బిఐ బ్రాంచ్ కి వెళ్లి విషయం ఫిర్యాదు చేయగా నెట్ బ్యాంకింగ్ ద్వారా డ్రా అయినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ విషయంపై తాను ఓటీపీ నెంబర్ గాని ఏటీఎం నెంబరు గాని ఫోన్ ద్వారా ఎవరికీ ఇవ్వలేదు అని చెప్పాడు. కానీ డబ్బులు మాత్రం రా అయినట్లు మెసేజ్లు వచ్చాయి, రైతు లబోదిబోమంటున్నారు. రైతు ఫిర్యాదుపై స్పందించిన ఎస్ఐ rozerpay ku అనే కంపెనీ ద్వారా డ్రా అయినట్లు గుర్తించబడని, ఇది సైబర్ క్రైమ్ కింద నమోదు చేసుకుని గద్వాల్ లోని సైబర్ CA కి బదిలీ చేశామని చెప్పారు. దీనిపై పై పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పారు. జరిగిన ఘటనపై తీవ్ర మనోవేదనకు గురైన ఆ రైతు కుటుంబం మాకు ఆత్మహత్య దారాన్ని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Comments