పనిచేయని మిషన్లు, ఇబ్బంది పడుతున్న రోగులు. నిర్లక్ష్యం ఎవరిది?
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ఉత్తర తెలంగాణ జిల్లా లోని వరంగల్ కరీంనగర్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర ఒరిస్సా ప్రజలు వైద్య సేవల కోసం వచ్చి పోతుంటారు. ప్రతిరోజు ఓపి వైద్య విభాగంలో 2500 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారు. వీరిలో కనీసం 200 మందికి ఎక్స్రేలు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. వీరితో పాటు ఈరోజు అత్యవసర వైద్య విభాగం, మెడికల్ లీగల్ కేసులు సుమారు 150 మందికి ఎక్స్రే పరీక్షలు చేసుకోవాలని డాక్టర్లు చీటీలు రాసి ఇస్తారు. ఎంజీఎంలో వైద్య సేవల కోసం వచ్చే వారి కోసం ఉచిత రక్త మరియు మూత్ర పరీక్షలు చేసి, ఆ నివేదిక ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ పరీక్ష చేసేందుకు ఎంజీఎంలో 8 యంత్రాలు ఉన్నాయి. నెల రోజుల నుండి సాంకేతిక లోపం కారణంగా అందులో 4 పనిచేయడం మానేశాయి. మరో నాలుగు పనిచేస్తున్నాయి. వీటికి తోడుగా శరీరంలోని రక్త కణాల పరీక్ష చేసేందుకు రేయోజన్స్ సప్లై లేక సెల్ కౌంటర్ యంత్రాలు పనిచేయడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు ఎంజీఎం ఆసుపత్రి పై దృష్టి సాధించి సాంకేతిక లోపంతో పనిచేయని యంత్రాలపై చర్యలు చేపట్టడం కాకుండా రక్త కణాలు పరీక్షించే సెల్ కౌంటర్ యంత్రాలకు కెమికల్ అందించి రోగులకు పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకునే అవసరం ఎంతైనా ఉంది.
Comments