ఆశ వర్కర్ల ఆందోళన... కరోనా వైరస్ వాక్సిన్ దాని కారణం...
గుంటూరు జిల్లా జీజీహెచ్లో ఉద్రిక్తత నెలకొంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఆశ వర్కర్ విజయలక్ష్మి మృతి చెందడంతో ఆశ వర్కర్స్ ఆందోళనకు దిగారు.నిరసన తెలుపుతున్న ఆశావర్కర్ల ను పోలీసులు అరెస్టు చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇంటి స్థలం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ సమయంలో జిజిహెచ్ కి చేరుకున్న గుంటూరు కలెక్టర్ జెసి ఎటువంటి హామీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం తో ఆశ వర్కర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తొ ఆశ వర్కర్ వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా జిజిహెచ్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Comments