భద్రతాదళాలలో ఎంపిక.ఆదిలాబాద్ జిల్లాలో ఇదే తొలిసారి...
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రానికి చెందిన గజ్జల పద్మ CRPF జవాన్ గా ఎంపికయింది. జిల్లా చరిత్రలోనే ఓ మహిళా భద్రత దళాలకు ఎంపిక కావడం ఇదే తొలిసారి.2018 లో సిఆర్పిఎఫ్ నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తు చేసుకున్న పద్మ ఫిజికల్ టెస్ట్ లో విజయం సాధించింది. అయితే కరోనా కారణంగా ఫలితాలు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం సిఆర్పిఎఫ్ లో ఎంపికైన అయిన వారి జాబితాలను విడుదల చేశారు. ఆ జాబితాలో తమ పేరు ఉండటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే పద్మ ఈ ఉద్యోగం అంత ఈజీగా సంపాదించలేదు.పేద కుటుంబంలో పుట్టిన ఆమె ఎన్నో కష్టాలను అధిగమించి ఉద్యోగం సాధించిందని చెప్పాలి.డిగ్రీ చదువుతున్నప్పటి నుంటే భద్రతాదళాల లో చేరాలని లక్ష్యం ఏర్పరుచుకున్న ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని దీటు గా నిలబడింది. ఆమె కాళ్ళను అర్థం చేసుకో నా కుటుంబ సభ్యులు కూడా ఆమెకు అండగా నిలబడ్డారు. దేశ సేవలో అమ్మాయిలు కూడా ఏమాత్రం తక్కువ కాదని నేర్పిస్తానని అంటున్న పద్మ. మరో వైపు కూతురు సాధించిన విజయంతో కన్నీళ్లు పెట్టుకుంది పద్మ తల్లి.
Comments