ప్రమాదంలో చేపల లారీ. సహాయం చేయకుండా దొరికింది దోచుకున్న స్థానికులు...
చేపల వేటకు వెళ్లి దొరికిన చేపలతో మంచి చేపల పులుసు వండుకుని తింటుంటే ఆ రుచే వేరు కదా? అయితే అదే చేపలు రోడ్డు మీద పడి ఉంటే ఎవరైనా వదులుకుంటారా? అచ్చం అలాంటి సంఘటనే చత్తీస్ఘడ్లో జరిగింది. అసలు విషయం ఏమిటంటే చత్తీస్గడ్ రాజధాని రాయపూర్ లో చేపల లోడుతో వెళ్తున్న ఓ భారీ వాహనం హఠాత్తుగా బోల్తా కొట్టింది. దీంతో అందులోని చేపలన్ని చెల్లాచెదురుగా రోడ్లమీద పడిపోయాయి.ఎప్పుడూ బిజీగా ఉండే అసద్ రోడ్లపై ఈ సంఘటన జరిగింది. రోడ్లపై చెల్లాచెదురుగా పడివున్న చేపలు చూసి స్థానికులు అంత గుంపులుగా వచ్చి సంచులో డబ్బాలో వేసుకుని తీసుకుని తీసుకుపోయారు. ఇక ఈ యాక్సిడెంట్ లో వాహనం డ్రైవర్ క్లీనర్ గాయాలతో ఇబ్బంది పడుతుంటే అక్కడ జనం మాత్రం చేపలు తర్వాత ఎవరైనా అన్నట్టుగా ప్రవర్తించారు. ఇక చేపల కోసం జనం ఎగబడటంతో సుమారు గంటసేపు ట్రాఫిక్ స్తంభించిపోయింది.చివరకు పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహాయంతో వాహనాన్ని తిరిగి యథాస్థానానికి తెచ్చారు. ఇబ్బంది పడుతూ మిగిలిన రోడ్డు మీద పడి ఉండే చేపలను తిరిగి ట్రాక్లోకి చేర్చారు. అయితే సహనం చేపలు చేపల ప్రేమికులకు చేరిపోయాయి.
Comments