విశాఖ జిల్లాలో తగలబడుతున్న శ్రీ చైతన్య బస్సులు...
విశాఖ జిల్లా వెల్దుర్తి లో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు స్కూల్ బస్సులు అగ్నికి ఆహుతి అయింది. నిలిపి ఉంచిన బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఎవరు గమనించక పోవడంతో వంటలు మరో రెండు బస్సులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. పెందుర్తిలో అగ్నిమాపక కేంద్రం లేకపోవడంతో కొత్తవలస విశాఖ నుండి ఫైరింజన్లు రప్పించారు. ఈ లోపు మంటలకు మూడు బస్సులు దగ్ధం అయాయి. మంటలు ఎలా చెలరేగాయి అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆగి ఉన్న బస్సులో నిప్పులు చెలరేగడంతో ఎవరైనా అంటించార? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్కింగ్ లో ఉన్న మిగిలిన బస్సులను పక్కకు తీయడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని తెలుస్తోంది. జరిగిన ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments