పెట్రోల్ ధరలు ఆకాశానికి. దిగి రాని ప్రభుత్వం..
మనదేశంలో ఆయిల్ కంపెనీలు ఇటీవల ధరల మోత మోగిస్తూ ఉన్నా ఇంధన ధరలు ఆకాశాన్ని అందుకున్నాయి. వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా రికార్డులు తిరగ రాస్తున్న లీటర్ పెట్రోల్ ధర వంద రూపాయలు దాటింది. రాజస్థాన్ లోని శ్రీ గంగా నగర్ లో పెట్రోల్ ధర 38 పైసలు పెంచుతూ, ప్రీమియం పెట్రోల్ ధర లీటర్క 101.80 పైసలు చేరుకుంది. మన దేశంలో రాజస్థాన్లోనే పెట్రోల్ ధరలు ఇతర ప్రాంతాల కంటే ఎక్కువగా ఉన్నాయి. గంగా నగర్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర వంద రూపాయల మార్కును దాటగా సాధారణ పెట్రోల్ ధర 99 రూపాయల ఎనభై పైసల చిల్లర ఉంది. ప్రీమియం అంటే అత్యంత నాణ్యమైన పెట్రోల్ అని అర్థం.ప్రీమియం పెట్రోల్ సాధారణమైన పెట్రోల కి మధ్య గల తేడా అక్టెన్ నెంబర్ సాధారణ పెట్రోల్ కు ఆక్ట్ నెంబర్ తక్కువగా ఉంటే, ప్రీమియం పెట్రోల్కు ఎక్కువగా ఉంటుంది. ప్రీమియం పెట్రోల్ ఆక్టెన్ నెంబర్ 91 గా ఉంటుంది. ప్రీమియం ఇంధనం యొక్క మండే కొలతను ఆక్టేన్ నెంబర్ గా పేర్కొంటారు. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 89.77 పైసల్ గా ఉంది. ఇక డీజిల్ ధర 83.46 పైసలు గా ఉంది. విజయవాడలో లీడర్ పెట్రోల్ ధర 92 రూపాయలు యాభై ఒక్క పైసలు ఉంటే, సెక్స్ డీజిల్ ధర 81 రూపాయలు 70 పైసలు పలుకుతోంది, విశాఖ లీటర్ పెట్రోల్ ధర 91, 91 పైసలు ఉంటే డీజిల్ ధర 85 రూపాయల 9 పైసలు గా ఉంది.రానున్న రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో ప్రభుత్వ తీరుపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments