పార్లమెంటు సమావేశానికి సర్వం సిద్ధం...

పార్లమెంట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది.శుక్రవారం నుండి సమావేశాలు ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు లోక్ సభ సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనుంది. రాష్ట్రపతి ప్రసంగం సెంట్రల్ హాల్లో ఉండగా వచ్చే ఎంపీలు వారి వ్యక్తిగత సిబ్బంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర విధానాలపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాలను బైకొట్ చేయాలని నిర్ణయించాయి. అదేవిధంగా చమురు ధరల పెరుగుదల పై ఉభయసభల్లో నిరసన తెలపాలని డిసైడ్ అయింది. ఢిల్లీలో జరిగిన విధ్వంసం ఘటనపై కుట్రదారులు ఎవరో తెలియవలసిన వలసిన అవసరం ఉందని ఇందుకోసం నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని డిమాండ్ చేయనున్నారు. మరోవైపు పార్లమెంటు క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు రేపటి నుండి అమల్లోకి రానుండగా, అందరి ఫేవరెట్ గా ఉండే హైదరాబాద్ బిర్యాని ₹25 నుండి 150 రూపాయలకు పెంచారు. వెజ్ బఫె 500 నాన్ వెజ్ బఫె 700 రూపాయల రూపాయలకు పెంచుతూ కొత్త మెనును రిలీజ్ చేశారు. అది తక్కువ ధర అంటే చపాతీ మూడు రూపాయలకు. ఉడకబెట్టిన కూరగాయలు 50 రూపాయలకు లభించనున్నాయి. కరోణ కారణంగా చర్యలు తీసుకోవడంతో పాటు, పెరిగిన ధరల దృష్ట్యా, దశాబ్దాలుగా అందిస్తున్న రైతూ తీరును ప్రభుత్వం తొలగించింది.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?