దొంగ బాబా మాటలు విని కన్న కూతురినే హతమార్చిన తల్లిదండ్రులు...

ఆ కుటుంబంలో అందరూ కూడా విద్యావంతులే, ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు కిరాతకంగా ప్రవర్తించారు. జాతీయ బాలికల దినోత్సవం నాడు వాళ్ళ ఇంటిలో పుట్టిన బాలికను కాటికి పంపించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి లో జరిగిన ఈ సంఘటన సంచలనం రేపింది. మదనపల్లి శివ నగరంలో నివాసం ఉంటున్న పురుషోత్తమ నాయుడ పద్మజా దంపతులకు ఇద్దరు కూతుర్లు. పద్మజ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్. కరస్పాండెంట్ గా కూడా పనిచేస్తుంది. పురుషోత్తమ నాయుడు మదనపల్లి మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. వారి కూతురు దివ్య లేఖ్య కూడా ఉన్నతంగా చదువుకున్నారు. ఒకరు ఎంబీఏ పూర్తి చేస్తే మరొకరు మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ లో డిగ్రీ చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా బాగా సెటిల్ అయ్యారు. ఆ విద్యావంతుల కుటుంబంలో   ఆధ్యాత్మిక మాయలో పడిపోయింది. బాబా నమ్మి రాత్రికిరాత్రే అద్భుతం  జరుగుతుందని అనుకొన్నారు. శాస్త్ర సాంకేతిక దార్ల దూసుకుపోతున్న ఈ ఈ ఆధునిక కాలంలో మంత్రాలు తంత్రాలు అంటూ నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లల పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. తల్లి ఇద్దరు కూతుళ్లను దంబిల్ తొ కొట్టి హత్య చేసింది. అయితే పూజలు పేర్లతో తల్లిదండ్రులు హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావించారు.అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన పిల్లలను హత్యచేసి విచిత్రంగా ఒక రోజు ఆగండి లేచి వస్తారు అని చెపుతున్నారు. కనీసం బంధువులను కూడా ఇంట్లో రానివ్వకుండా పూజలు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పూజ కోసం పిల్లలను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో కి  dsp రవి మనోహర్  చారి చేరుకొని దర్యాప్తులు చేస్తున్నారు. మృతుల తల్లి మానసిక స్థితి బాగోలేదని ఆయన తెలిపారు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?