వ్యవసాయ రంగం పై సీఎం కేసీఆర్ సమీక్ష...
తెలంగాణలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ కృషి చేయాలన్నారు సీఎం కేసీఆర్. వ్యవసాయ శాఖ కాగితం కలం శాఖ కాకుండా పొలం కలం శాఖగా మారాలి అన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాధాన్యం పెరిగింది అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలు మార్కెట్లో ఇబ్బంది లేకుండా అమ్ముకొని ల చూడవలసిన బాధ్యత మార్కెటింగ్ శాఖ పై ఉందని అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో సాగు చేయ వలసిన పంటలు అవలంబించవలసిన విధానంపై సీఎం పలు కీలక సూచనలు ఇచ్చారు. సాగు లొ దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని అన్నారు. ఏటా నాలుగు కోట్ల టన్నుల ఆహారం ధాన్యాలు పండించే రాష్ట్రంగా ఎదుగుతున్న మని అన్నారు, ఆయన వ్యక్తం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 2600 క్లస్టర్ లో నిర్మించిన రైతు వేదికలను వెంటనే ఇవ్వాలని అన్నారు సీఎం కేసీఆర్. రైతు ఎప్పుడు ఒకే పంట వేసే విధానం పోవాలి అన్నారు. పంట మార్పిడి వలన ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని అన్నారు. గ్రామాలలో కూలీల కొరత ఉన్నందున వ్యవసాయం లో యంత్రికరణ పెరగాలని అన్నారు. పంటల సాగు విధానం లో ఆధునిక పద్ధతులు రావాల్సి ఉందని అన్నారు.
Comments