డ్రోన్ ద్వారా 40 శాతం ఆదా...
డ్రోన్ ఆపరేట్ చేస్తున్న అతని పేరు సురేష్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం లక్ష్మీపూర్ క్యాంప్. పురుగుల మందు పిచికారీ లో కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్ కొనుగోలు చేశాడు.తన పొలం తోపాటు మండలంలోని రైతులు పొలాలకు డ్రోన్ సహాయం తో పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. డ్రోన్ సహాయం వలన సమయం ఆదా తో పాటు 40 శాతం పురుగులమందు ఆదా అవుతుందని రైతులు drone sprayer కు మొగ్గుచూపుతున్నారు. ఎకరానికి సరిపడా పురుగుల మందు కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే స్ప్రే చేస్తుంది. డ్రోన్ స్ప్రే రైతులకు ఎంతో ఉపయోగ కరంగా ఉందని అంటున్నారు ఇందురు రైతన్నలు. అయితే డ్రోన్ ధర ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలని చెబుతున్నారు.యంత్రలక్ష్మి పథకాలలో ఇప్పటికే అనేక రకాల యంత్రాలను రైతులకు అందించిన ప్రభుత్వం, రైతుల శ్రేయస్సు కొరకు ఎటువంటి ఆధునిక డ్రోన్ స్ప్రేయర్లు అందించాలని రైతు సంఘాలు కోరుతున్నారు. ఆ దిశలో సర్కారు నిర్ణయం తీసుకుంటుందని ఆశిద్దాం.
Comments