గోదావరి నదిలో హఠాత్తుగా...
మంచిర్యాల జిల్లా ఇందారం గోదావరి నది బ్రిడ్జి వద్ద గోదావరి రెండుగా చీలిపోయింది.సరిగ్గా జిల్లా సరిహద్దులను గోదావరిలో విడగొట్టే అన్నట్టుగా ఆ దృశ్యం కనిపించింది.విషతుల్యమైన జలాలను తనలో కలుపుకుని గోదావరి మధ్యలో నుండి ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండడం తో అధికారులు నీటి గోదావరి దిగువ నది లోకి వదులుతున్నారు. దీంతో ఇందారం వద్ద గోదావరి నది రెండు వైపులా బొడ్డుని తాకుతూ ప్రవహిస్తోంది. అయితే బ్రిడ్జి మధ్య లో గోదావరి నది మధ్య భాగంలో ఏర్పడిన ప్రత్యేక ఆకర్షణ గా ఏర్పడుతుంది. ఏర్పడ్డ వింతను చూసేందుకు మంచిర్యాల జిల్లా ప్రజలతోపాటు పెద్దపల్లి జిల్లా నుంచి కూడా ప్రజలు తరలి వస్తున్నారు. బ్రిడ్జిపై వెళ్లే వాహనదారులు కూడా ఒక్క నిమిషం ఆగి మరీ చూసి వెళ్తున్నారు. మంచి లో చెడు కలవదు అంటే ఇదేనేమో స్థానికులు చర్చించుకుంటున్నారు
Comments