కేజీ మటన్ రెండు వందల రూపాయలు మాత్రమే, ఇలా ఆఫర్ పడితే చివరకు జరిగేది ఇదే...
జి.కొండూరు లో ఓ మాంసం దుకాణదారుడు చేసిన ప్రకటన వివాదానికి దారి తీసింది.కేజీ మటన్ రెండు వందల రూపాయలు ఇస్తానని చెప్పాడు,అందుకు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని షరతు విధించాడు,స్థానికులు అతడి షాపు ముందు బారులు తీరారు.కాసేపటికి మాంసం అయిపోయినట్టు బోర్డు తిప్పేశాడు.దీంతో షాపు యజమాని పై మండిపడ్డారు ఎందుకు కిలో రెండు వందల రూపాయలకు అమ్మడం లేదంటూ తిట్లదండకం మొదలుపెట్టారు. అధికారులు ఇలాంటి షాపుల పై దృష్టిపెట్టాలని కోరుతున్నారు. మటన్ కేజీ 200 నిజానిజాలు నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. అయితే జి.కొండూరు వేట మాంసం అమ్మకాలు నాణ్యత ఉంటుందనే పేరు రావడంతో షాపు యజమాని మధ్య పోటీ పెరిగింది. దీంతో మాంసం ధరలు తగ్గించి అమ్మారని సమాచారం కాకపోతే ఇక్కడ కథ రివర్స్ అయింది.
Comments