దీక్షిత్ రెడ్డి కిడ్నాపర్ మంద సాగర్ గురించి పోలీస్ విచారణలో ఆసక్తికరమైన విషయాలు...

 

        

                 దీక్షిత్ కిడ్నాప్ కేసులో నిందితులు దొరికిన జవాబు లేని ప్రశ్నలు మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయి. జల్సా జీవితానికి అలవాటు పడిన నిందితులు, సైకో మెంటాలిటీ పై గ్రామస్తులు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. మహబూబాబాద్ లో కిడ్నాప్ ఆపై హత్యకు గురైన దీక్షిత్ రెడ్డి హత్య కేసులో నిందితులు దొరికిన పలు ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇంటర్ చదివి మెకానిక్ పనిచేస్తున్న సాగర్ ఒక్కడే కిడ్నాప్ హత్య చేయడం ద్వారా ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేయడం పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు అనంతరం హత్యలో సాగర ఒక్కడి ప్రమేయం ఉందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు దీక్షితులు కిడ్నాప్ చేసిన నిందితుడు, కేవలం రెండు గంటల్లో పై హత్య చేశాడని S.P కోటిరెడ్డి వెల్లడించారు. పెట్రోల్ బంకు కి వెళ్దామని చెప్పి పిలవడంతో, తెలిసిన వారే కావడంతో బైక్ ఎక్కడని చెప్పారు.తరువాత నీటిలో నిద్రమాత్రలు కలిపి బాలుడితో తాగించాడు. బాలుడు ఏడుస్తూ ఉండడంతో నోరు, ముక్కు మూసి గొంతు నలిమి హత్య చేశాడని, ఆ తర్వాత ఏం తెలియనట్టు నిందితుడు బాధితుల ఇంటికి వెళ్లాడని ఎస్పి వెల్లడించారు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నిందితుడికి అవగాహన ఉందని అందుకే వాటికి దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు అన్నారు.హత్య చేసిన తర్వాత బాలుడి తండ్రి రంజిత్ రెడ్డి కి ఫోన్ చేసి 45 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని,ఎస్పీ తెలిపారు.  నిందితుడు మంద సాగర్ తన మెకానిక్ షాప్ ఎదురుగా ఉన్న మూడు కోట్ల చౌరస్తా దగ్గరికి తీసుకు రమ్మని ఫోన్ చేయగా డబ్బు సంచితో బాలుడు తండ్రి రంజిత్ రోడ్డుపై నిలబడ్డాడు. అలాగే చుట్టూ పోలీసులు మఫ్టీలో ఉండి కిడ్నాపర్ కోసం వేచి చూశారు.ఇందులో కొందరు పోలీసులు కిడ్నాపర్ మెకానిక్ షాప్ లో కూర్చుని బ్యాగ్లో 45 లక్షల రూపాయలు లేవని నకిలీ నోట్లు ఉన్నాయని మాట్లాడుకో గా నిందితుడు విన్నాడు.దీంతో మరోసారి బాలుడు తండ్రికి ఫోన్ చేసి బ్యాగ్లో నకిలీ నోట్లు వుంచి మోసం చేయాలనుకుంటున్నావ? నేను అంతా చూస్తున్నా అన్నాడు. అయితే ఇవి నిజమైన నోట్లే అని చెప్పగా అప్పటివరకు వాయిస్ చేంజ్ యాప్ ద్వారా ఇంటర్నెట్ కాల్ చేసిన నిందితుడు ఆ తర్వాత బ్యాగ్ లోని నోట్లను స్కైప్ ద్వారా చూశాడు. తన ముఖం కనపడకుండా జాగ్రత్త పడిన సాగర్ మాట్లాడిన ఫోన్ నెంబర్ డిస్ప్లే కావడంతో సైబర్ క్రైమ్ టీం నిందితున్ని అరెస్టు చేసింది. నిందితుడి లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సాగర్ ఇద్దరు బావలు పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వారి కంటే ఎక్కువ డబ్బు సంపాదిస్తాను, అని పదే పదే చెప్పే వాడని అతని స్నేహితులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఈజీ మనీ సంపాదించడం కోసం యూట్యూబ్ ద్వారా నిరంతరం టెక్నాలజీ మీద పట్టు సాధించాడు. గతంలో ఇజ్రాయెల్ కంపెనీకి చెందిన ఓ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒక యువతిని వేధించాడు. ఈ వేధింపుల కేసులో సాగర్ పోలీసులకు చిక్కలేదు. తాజా ఘటనతో సాగర్ లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. యూట్యూబ్ లో చూసి నిందితుడు ఇంటర్నెట్ కాలింగ్ నేర్చుకున్నట్లు తెలుస్తోంది.ఐ డోంట్ వాంట్ టు పర్ఫెక్ట్ లైఫ్ ఐ వాంట్ హ్యాపీ లైఫ్ అంటు, మంద సాగర్ తన ఫేస్ బుక్ వాల్ పై రాసుకున్నాడు. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు ఇంటర్నెట్ ద్వారా కాలింగ్ చేయడంపై తెలుసుకున్న ఆసక్తికర విషయాన్ని చెప్పినట్లు సమాచారం.ఒకసారి రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన స్నేహితుడు ఇంటర్నెట్ ద్వారా సాగర్ కు ఫోన్ చేసి ఆట పట్టించాడు. అలా మొదటిసారి ఇంటర్నెట్ కాలింగ్ వివరాలను ఇంటర్ చదివిన మంద సాగర్ తెలుసుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్ ద్వారా అవగాహన పెంచుకున్న క అదే విధానంలో బాలుడి తల్లి కి ఫోన్ చేశాడు.నిందితుడు మంద సాగర్ శనగ పురం లో ఆదినుంచి వివాదాస్పదంగా ప్రవర్తించే వాడని స్థానికులు చెబుతున్నారు.రెండేళ్ల క్రితం ఆయనకు ఓ యువతితో వివాహం నిశ్చయం కాగా ఆ అమ్మాయిని శివారు ప్రాంతానికి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల తన తాత చేయి విరగ్గొట్టాడు అని స్థానికులు చెబుతున్నారు. గతంలో పోలీసుల వద్ద డ్రైవర్గా పనిచేసిన సాగారు పట్టణాల్లో రెండేళ్లుగా మెకానిక్ షాప్ నడుపుతున్నాడు.

Comments

Popular posts from this blog

OnlineIT | Best CCTV Camera Suppliers in Abu Dhabi | Wireless CCTV Installation & Maintenance

Choosing the Best SEO Company in Abu Dhabi: Unveiling Excellence

best cricket jersey designs and other sportswear manufacturing company?