కుటుంబం కోసం 70 ఏళ్లుగా మగవారి లాగా...
పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన సావిత్రి కథ లక్షల మందికి ఆదర్శంగా నిలిచి పోతుంది. అనడం అతిశయోక్తి కాదు.కుటుంబంలో అందరూ ఆడబిడ్డలు కావడంతో ఆమె తల్లి సావిత్రిని మగ బిడ్డ గా చూసుకోవాలని ముచ్చట పడింది. అనుకున్నదే తడవుగా యుక్తవయసులో నిక్కరు చొక్కా తొడిగింది. అంతే సావిత్రి యువకుడిగా మెరిసింది.ఇంత వరకు బాగానే ఉన్నా ఒక్కసారిగా కుటుంబాన్ని కుదిపేసిన ఆర్థిక ఇబ్బందులు ఆమెను పూర్తిగా అతడుగా మార్చేశాయి. తోడబుట్టిన అక్కాచెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసేందుకు వివాహబంధాన్ని వద్దనుకుని ఒంటరిగానే ఉండిపోది. స్త్రీ వాదానికి కొత్త నిర్వచనం ఇచ్చేలా జీవిస్తోంది సావిత్రి. కుటుంబాన్ని పోషించాలంటే అన్ని పనులు చేయాలని నిర్ణయించుకున్న ఆమె మగవాళ్లతో సమానంగా పని చేసేది. ఆ కూలీ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించింది. తల్లిదండ్రులు మరణం తర్వాత ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ల వివాహాలను ఆమె చేసింది. కుటుంబం కోసం మగాడిగా మారినదుకు గర్వంగా ఉంటుంది, అంటుంది సావిత్రి. ఈ జన్మ తన కుటుంబం కోసమే అనుకుంది.మగాడిగా జీవితంలో 70 ఏళ్లు గడిపేసింది.ఈ పశ్చిమ గోదావరి సావిత్రి గాధ ఎందరికో స్ఫూర్తిగా మిగిలిపోతోంది.
Comments