60 ఏళ్ల తర్వాత ఆమెకు శిక్ష సూది రూపంలో... మరణశిక్ష ఖరారు చేసారు...
అమెరికాకు చెందిన 52 ఏళ్ల Lisa Montgomery(లిసా మొంట్గోమరీ). ఈ ఏడాది డిసెంబర్ 8న ఆమెకు ఫెడరల్ ఎక్జిక్యూట్ శిక్షను అమలు చేశారు. ఫెడరల్ ఎక్జిక్యుట్ శిక్ష అంటే క్షణాల్లో ప్రాణాలు తీసే పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చే మరణ దండన విధిస్తారు, అమెరికా ప్రభుత్వం. ఇదే ఇప్పుడు అమెరికాలో సంచలన వార్త,60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత US లొ ఓ మహిళకు ఫెడరల్ ఎక్జిక్యూట్ అమలు పరుస్తున్నారు. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఈ ఫెడరల్ డెత్ పెనాల్టీ విధిస్తారు.అందుకే లీసా కేసు న్యూస్ ఆఫ్ అమెరికా గా మారింది. లిసా చేసింది మామూలు నేరం కాదు. అందుకే ఇంతటి కఠిన శిక్ష, గర్భవతి పొట్ట చీల్చి కడుపులోని బిడ్డను బయటకు తీసి ఎత్తుకెళ్లింది.అత్యంత క్రూరంగా పాశవికంగా ఆమె చేసిన నేరానికి స్పెషల్ శిక్ష విధించారు,అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్. 2004 డిసెంబర్ 16 జరిగింది ఘాతుకం మిస్సోరి కి చెందిన 23 ఏళ్ళ బాబీ జో స్టిన్నెట్ అప్పటికే గర్భవతి.ఆమెతో చాట్ రూం లో పరిచయం చేసుకుంది మిస్సోరి చెందిన లిసా.తాను కూడా గర్భవతినీ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. బోభి సిన్నెట్ ఇంట్లో ఉన్న ఓ కుక్క పిల్లలను దత్తత తీసుకుంటానని వాళ్ళ ఇంటికి వెళ్లింది లిసా. వెంటనే ఆమెను చూసి బోబి స్తిన్నెట్ ను తాళ్లతో కట్టేసి బంధించింది. దీనితో తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె వదల్లేదు.కిచెన్ లో ని కత్తితో ఆమె గర్భాన్ని కోసి ఎనిమిది నెలల పసికందును బయటకు తీసింది.అనంతరం ఆ బిడ్డతో అక్కడి నుంచి పారిపోయింది. బొబి స్తిన్నెట్ స్పాట్ లోనే చనిపోయింది.భర్త కంప్లైంట్ తో ఆ ఆ మర్డర్ చేసిన లిసా ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ హత్య అప్పట్లో ఓ సెన్సేషన్. కేసు విచారణ సందర్భంగా లిసా మానసిక స్థితి సరిగా లేదంటూ వాదించాడు, ఆమె తరుపు లాయర్.ఆ బాధను తిప్పికొడుతూ లిసాకు మరణ దండన విధించి జ్యూరీ. లేటెన్ ఇంజక్షన్ తో లిసా ప్రాణాలు తీయాలని ఆదేశించింది. అత్యంత అరుదైన ఘటనలో మాత్రమే ఇలా ఫెడరల్ డెత్ పెనాల్టీ అమలు చేస్తారు.ఈ డిసెంబరు 8న ఇండియానా TERREHAT లోనీ,FCC లో ఈ శిక్షను అమలు పరుస్తారు. ఓ మహిళకు ఫెడరల్ ఎక్జిక్యూట్ అమలు పరుస్తూ ఉండడం 60 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఈ శిక్షణలో ఓ ఆసక్తికర విషయం ఉంది. ఎనిమిది నెలల గర్భవతి స్తిన్నెట్ కడుపును కోసి బయటకు తీసిన బిడ్డ బతికే ఉంది. ఆమె తండ్రి సంరక్షణలో పెరుగుతోంది ఆ బిడ్డకు ఇప్పుడు పదహారేళ్లు. పేరు విక్టోరియా జో స్తిన్నెట్
Comments